గాల్లో విమానం.. ప్రయాణికుడికి అస్వస్థత, డాక్టర్‌గా మారిన గవర్నర్ తమిళిసై

Telugu Box Office

వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? అని అనౌన్స్ చేయడంతో విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. కాసేపటికి కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు సైతం గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని ఫోటోలు తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో రాకముందు ఆమె కొంతకాలం ప్రాక్టీస్ చేశారు.

Share This Article