మళ్లీ వస్తున్న ‘అవతార్’… మూడు నెలల ముందే పండగ

Telugu Box Office

అవతార్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఈ విజువల్ వండర్‌గా వచ్చి సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా కోసం పత్యేకంగా ఓ గ్రహాన్నే సృష్టించాడు కామెరూన్. దాంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ సినిమాకి అభిమానులుగా మారిపోయి వేల కోట్లను కట్టబెట్టారు. అంతేకాకుండా.. అప్పట్లో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. అలాగే.. ఈ సినిమాకి పలు సీక్వెల్స్ ఉంటాయనే అప్పట్లోనే కామెరూన్ ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచే ఈ మూవీ సీక్వెల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో అవతార్ సీక్వెల్ అయిన.. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్(Avatar The Way Of Water)’ చిత్రాన్ని గ్రాండ్‌గా డిసెంబర్ 16, 2022న విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్సాన్స్‌ని అందుకుంది. ఈ సినిమా మొదటి పార్ట్ కంటే గ్రాండియర్‌గా ఉంటుందనే భావనని ప్రేక్షకుడి మదిలో కలిగించింది. దీంతో అవతార్ 2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అవతార్‌ 1ని మళ్లీ విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అది కూడా అవతార్ 2 విడుదలకి దాదాపు మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ 23 విడుదల చేసేందుకు సిద్ధమైంది. అది కూడా లిమిటెడ్ థియేటర్స్‌లో మాత్రమే. దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ.. పెద్ద స్ర్కీన్‌లో చూడడం మిస్ అయినా ఎంతోమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Share This Article