సైన్స్‌కే అంతుబట్టని శివాలయాలు.. ఎన్నో వింతలు

Telugu Box Office

మహానంది.. శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో అయినా కొనేరులో నీరు గోరు వెచ్చగానే ఉంటుంది.

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు – కనిగిరి మధ్య)
కె. అగ్రహారంలోని కాశీవిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.

కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతాడు. ఇది అద్భుతం.

అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.

వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడిలో సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.

ద్రాక్షారామంలో శివలింగాన్ని నిత్యం ఉదయం, సాయత్రం సూర్య కిరణాలు తాకుతాయి.

భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతుంది.

కోటప్పకొండలో ఎటుచూసినా మూడు శిఖరాలే కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు.

గుంటూరు జిల్లా చేజర్లలో కపోతేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడి లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లుపోస్తే శవం కుళ్లిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.

బైరవకోన: ఇక్కడికి కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.

యాగంటి: ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు

శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు “జుం”తుమ్మెద శబ్దం వినపడేదట

కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు శివలింగంగా మారింది. ఈ ఆలయంలో ఏడాదిలో ఆరు నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది.

శ్రీకాళహస్తిలో వాయు రూపములో శివలింగం ఉంటుంది.

అమర్‌నాథ్‌లో శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.

కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజుల్లో ఒక్క చుక్క కూడా కనిపించదు.

మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.

తమిళనాడులోని తిరు నాగేశ్వరములో శివ లింగానికి పాలు పోస్తే నీలం రంగులోకి మారుతాయి.

చైనాలో కిన్నెర కైలాసము
ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా.. మధ్యాహ్నం పసుపుగా.. సాయంత్రం తెలుపుగా.. రాత్రి నీలంగా మారుతుంది.

Share This Article