ఏపీ ప్రభుత్వం వల్ల పవన్ సినిమాకు భారీ నష్టం?.. ఎన్ని రూ.కోట్లంటే

Telugu Box Office

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు.. విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. సాగర్ కె.చంద్ర ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే సమయంలో విడుదల కానుండటంతో ‘భీమ్లా నాయక్’‌ విడుదల తేదీ మార్చాలని పవన్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకు 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఏపీలో టికెట్ రేట్ల తగ్గించడంతో ఆ ఏరియాకు తక్కువ ధరకే హక్కులు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ‘భీమ్మా నాయక్’ నిర్మాతలకు సుమారు రూ.10కోట్ల వరకు ఆదాయం తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Share This Article