పానీపూరీలు తిని కడుపు నింపుకున్నా.. అమితాబ్ ఎమోషనల్

Telugu Box Office

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్ లో స్టార్ గా మెగాస్టార్ గా ఎదిగారు అమితాబ్. తన నటనతో అందరి చేత లక్షలాది మందిని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారు బిగ్ బి. ఇప్పటికి అదే ఉత్సహంతో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు అమితాబ్. అయితే బిగ్ బి హీరోగా కెరీర్ ప్రారంభించడానికి ముందు చాలా స్ట్రగుల్ పడిన విషయం తెలిసిందే. ఆయన గొంతు, హైట్ కారణంగా ఆయనకు సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి కొంతమంది నిరాకరించారని గతంలో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఎన్ని అవమానాలు ఎదురైనా బరించి స్టార్ గా ఎదిగాను అని తెలిపారు బిగ్ బి. తాజాగా మరోసారి ఆయన జీవితంలో ఎదురైనా సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

అమితాబ్ సినిమాల్లోనే కాదు పలు టీవీషోల్లోనూ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పాపులర్ కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ షోకు బిగ్ బి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో గతంలో తన ఫ్యామిలీ గురించి, వ్యక్తిగత విషయాలను గురించి చాలా తెలిపారు అమితాబ్. తాజాగా ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు కడుపునిండా తిన్నాడని సరైన తిండి కూడా ఉండేది కాదని తెలిపారు.

కౌన్ బనేగా కరోడ్ పతి లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బి మాట్లాడుతూ.. తాను సినిమాలలోకి రాకముందు కడుపునిండా అన్నం తినడం కోసం ఎంతో కష్టపడ్డాను అంటూ తన కష్టాలు గురించి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రావడానికి ముందు కలకత్తాలో పని చేశేవాడినని.. ఆ సమయంలో తినడానికి సరైన తిండికూడా దొరికేది కాదని అన్నారు బిగ్ బి. కలకత్తాలో పని చేస్తున్న సమయంలో నెలకు 300 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేవారు. దాంతో రోజు తిండికి సరిపోయేది కాదు. అప్పుడు పానీ పూరి తిని కడుపు నింపుకునేవాడిని అని తాను పడిన కష్టాన్ని తెలిపారు అమితాబ్ బచ్చన్.

Share This Article