‘లైగర్‌’లో నటుల రెమ్యునరేషన్.. హీరో కంటే ఆయనకే ఎక్కువట

Telugu Box Office


టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లైగర్‌. ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు.

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ క్రియేట్ చేశారు. అయితే ఇదెక్కడా సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు రూ.90కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ బడ్జెట్‌, హీరోహీరోయిన్లు, ఇతర నటుల రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

లైగర్‌ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్‌ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్‌ నటి రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి విజయ్‌ దేవరకొండ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. హీరో తల్లిగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటి రూపాయలు తీసుకోగా.. కోచ్‌గా కనిపించిన రోనిత్‌ రాయ్‌ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్‌గా అందాలు ఆరబోసిన అనన్య పాండే రూ.3 కోట్ల అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్‌గా నిలిచిన మైక్ టైసన్‌గా హీరో కంటే ఎక్కువగా రూ.40కోట్లు అందుకున్నాడట.

Share This Article