భర్త మరణం తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్న మీనా

Telugu Box Office

తెలుగు తమిళ భాషలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29వ తేదీ ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విద్యాసాగర్ మృతి చెందడంతో మీనా ఎంతగానో కృంగిపోయింది. మీనా భర్త మరణం అనంతరం పలువురు సెలబ్రిటీలు తన ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిస్తూ తనకు మనోధైర్యం చెప్పారు. అయితే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి మెల్లిగా బయటపడి తిరిగి మామూలు మనిషి అవుతున్నట్టు తెలుస్తుంది. భర్త మరణం తర్వాత మీనా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 13 అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం కావడంతో ఈమె ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అవయవాలు దానం చేసేవారు లేక మృతి చెందారని, తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని అందుకే తన మరణాంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు మీనా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా మీనా ఒక పోస్ట్ చేస్తూ తాను అవయవాలను దానం చేస్తున్నానని ఒక మనిషి ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పని ఏదీ లేదంటూ చెప్పుకొచ్చారు.ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడువచ్చని వెల్లడించారు. ఇలా అవయవాలు దానం చేసేవారు లేకే తన భర్తను కోల్పోయానని లేకపోతే తన భర్త తనతో పాటే ఉండేవారని మీనా ఆవేదనకు గురయ్యారు.

Share This Article