బాలయ్య అరుదైన ఘనత.. దేశంలోనే నెంబర్ వన్ షోగా ‘అన్ స్టాపబుల్’

Telugu Box Office

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’గా గర్జించిన బాలయ్య…. అల్లు ఫ్యామిలీకి చెందిన ప్రముఖ ఓటీటీ సంస్థ aha కోసం హోస్ట్‌గా మారి ‘అన్ స్టాపబుల్’ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. గెస్ట్‌లుగా వచ్చిన స్టార్స్‌తో బాలయ్య తనదైన స్టైల్‌లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్న ఈ షో నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది.

ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్న హాజరుకాగా.. ఆ తర్వాత నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, సుకుమార్- రష్మిక మందన్న- అల్లు అర్జున్, రవితేజ- గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరై ఆకట్టుకున్నారు.

అసలు విషయానికొస్తే ‘అన్ స్టాపబుల్’ షో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో 9.7 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ 7.8 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తానికి 2021లో ‘అఖండ’తో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన నందమూరి నటసింహం.. ఓటీటీలో తన సత్తా చాటాడు.

Share This Article