ఆ బాలీవుడ్‌ హీరో సరసన యువరాణిగా సమంత

Telugu Box Office

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది వారికి కూడా చేరువైంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంతకం చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియాలో సామ్‌కు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.

బాలీవుడ్‌లో ‘హిందీ మీడియం’, ‘లూకా చప్పీ’, ‘స్త్రీ’ వంటి సినిమాలను నిర్మించిన ప్రతిష్ఠాత్మక సంస్థ మ్యాడ్‌ డాక్ ఫిలిమ్స్. తాజాగా ఓ హార్రర్ కామెడీ‌ని నిర్మించనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, సమంత హీరో, హీరోయిన్స్‌గా నటించనున్నారట. ఈ సినిమాలో సామ్ మహారాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆయుష్మాన్ రక్త పిశాచి రోల్‌ను పోషించనున్నాడని తెలుస్తోంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నీరెన్ బట్ స్క్రిఫ్ట్‌ను అందించనున్నాడు.

సామ్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టున్నాయి. ‘యశోద’ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా రూపొందింది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ భారీ‌గా ఉన్నాయని తెలుస్తోంది. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం మేకర్స్ అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ లోను హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ‘శాకుంతలం’ ప్రమోషన్స్ ను మొదలుపెడతామని గుణ శేఖర్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. విజయ్ దేవర కొండతో ‘ఖుషి’ (Kushi) చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ‘సిటాడెల్’ (Citadel) లోను నటిస్తుంది.

Share This Article